ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరిది వివాహేతర సంబంధం.. చివరకు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 12:29 PM

వదినతో ఎఫైర్ పెట్టుకున్న మరిది చివరకు ఆమెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలోని ఘోగ్రిపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఘోగ్రిపూర్ గ్రామానికి చెందిన పరమ్‌జిత్ కౌర్(35), మనోజ్ దంపతులకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. కొన్ని నెలల నుంచి మనోజ్ తమ్ముడు అమన్(28), పరమ్‌జిత్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి 15 రోజుల్లో వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అమన్‌ను ఇంట్లో నుంచి పంపించేశారు. కానీ అమన్, పరమ్‌జిత్ ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. కలిసి ఉండలేకపోతున్నామని, చనిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa