ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న భూ హక్కు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 24, 2021, 01:53 PM

తూర్పు గోదావరి: మలికిపురం మండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంలో భాగంగా రిజిస్టర్డ్ పత్రాలు అందచేసే కార్యక్రమన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు పాల్గొని, లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించడం కోసం నిరంతరం పాటు పడుతున్నారని, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో శ్రామిస్తున్నారని అన్నారు. ఒన్ టైం సెటిల్మెంట్ ద్వారా బకాయిల్లో ఉన్న ఇళ్లకు శాశ్వత హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ లు చేసే మహోత్తర కార్యక్రమం చేపట్టారని అన్నారు. దీనిని దుర్మార్గపు ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు, సర్పంచ్ లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa