కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ఆయా సంస్థలు, కంపెనీలు రకరకాల ఆఫర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ కూలీ ఐఫోన్ -12 గెలుచుకున్నాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ నిర్వహించిన లక్కీ డ్రాలో కిషన్ భాయ్ అనే కూలీకి ఈ అదృష్టం వరించింది. లక్కీ డ్రా గురించి తొలుత అధికారులు ఫోన్ చేసి చెప్పినప్పుడు తాను నమ్మలేదని.. అయితే అధికారులే తన చిరునామాను వెతుక్కుంటూ ఇంటికి వచ్చారని కిషన్ భాయ్ సంతోషం వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa