ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ కొత్త స్కీమ్.. పిల్లల్ని కంటే రుణాలిస్తారు!

international |  Suryaa Desk  | Published : Sat, Dec 25, 2021, 11:59 AM

దేశ జనాభా విస్ఫోటనాన్ని అడ్డుకునేందుకు అనుసరించిన వ్యూహం ఇప్పుడు చైనా ను కొత్త సమస్యల్లోకి నెడుతోంది. అక్కడ అమలు చేసిన కఠిన నిబంధనల ఫలితంగా జనాభా అదుపులోకి వచ్చినప్పటికీ ఆ దేశంలో ఇప్పుడు యువత సంఖ్య తగ్గేందుకు కారణం అయింది. ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు ముందస్తు వ్యూహాలను చైనా అమలు చేస్తోంది. ఈ కోవలోనే జిలిన్ ప్రావిన్సు ప్రకటించిన కొత్త పథకం ఆసక్తికరంగా మారింది. పెళ్లై పిల్లలను కనాలనుకునే జంటలకు 2 లక్షల యువాన్ల (సుమారు రూ. 25 లక్షల) బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని ప్రకటించింది. అలాగే చిరు వ్యాపారాలు నడిపే జంటలకు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారి వ్యాపారాల్లో పన్నులపై రాయితీని ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa