ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమదాలవలస పరిధిలో రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని మహిళ మృతదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 07:37 PM

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ సమీపం వెంగళ రావు కాలనీ వద్ద బుధవారం రైల్వేట్రాక్‌పై గు ర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్టు జీఆర్పీ ఎస్‌ఐ ఎం.మధుసూ దనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సుమారు 50 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ రైలు ప్రమాదంలో మృతి చెందిందన్నారు. మృతురాలు పసుపు రంగుచీర ధరించి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించా మన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరికైనా ఈమె వివ రాలు తెలిస్తే 9247585744 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa