దేశంలో కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అవసరమైతే ఆంక్షలను విధించాలని సూచించింది. దీంతో ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, ఇతర ఆంక్షలను అమలు చేస్తున్నాయి. తాజాగా, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు దేశ వ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యలు అమలును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. కొత్త వేడుకల సందర్భంగా ఎక్కడా నిబంధనలు సడలించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పండగ సీజన్లో రద్దీని నియంత్రించేందుకు అవసరం అనుకుంటే స్థానికంగా ఆంక్షలు, పరిమితులు విధించుకోవచ్చని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకు సోమవారం లేఖలు రాశారు. భౌతిక దూరం, కరోనా నిబంధనల అమలుకు 144 సెక్షన్ కూడా విధించుకోవచ్చని తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేయాలన్నారు. ఆక్సిజన్ లభ్యత, మందుల స్టాక్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య దాదాపు 600కు చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa