ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 సవర్ల బంగారు అభరణాల చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 09:04 AM

గుంటూరు: శావల్యాపురం మండలంలోని కనమర్లపూడిలో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి ఏడుకొండలు కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా, వారి పిల్లలు ఇద్దరు పాఠశాలకు వెళ్లారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం తీసి లోపల బీరువాలో ఉన్న 15 సవర్ల బంగారు అభరణాలు చోరీ చేశారు. వాటి పక్కనే వెండి వస్తువులు, మంచం మీద ఫోన్ ఉన్నా తీసుకోలేదు. ఇంటికి వచ్చిన ఏడుకొండలు కుటుంబసభ్యులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa