ఏపీ పోలీస్ శాఖ మరో ప్రతిష్ట ను సొంతం చేసుకుంది.దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ మరోసారి నిలిచారు. ప్రజలకు ఉత్తమ సేవల అందించడంతో ఆయనను అత్యుత్తమ డీజీపీగా ప్రకటిస్తున్నట్లు ది బెటర్ ఇండియా సంస్థ తెలిపింది. గత రెండేళ్లలో కరోనా ఎఫెక్ట్తో అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. అలాంటి కష్ట సమయంలోనూ డీజీపీ సవాంగ్ రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడింది. 2021 సంవత్సరానికి దేశంలో ఉత్తమ సేవలు అందించిన 12 మంది IAS, IPS, IFS అధికారుల జాబితాను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది.దిశా యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంలో డీజీపీ సవాంగ్ సేవలను ది బెటర్ ఇండియా సంస్థ ప్రశసించింది. దిశా యాప్లోని ఎస్వోఎస్ బటన్ (ఆప్షన్) ద్వారా అనేక మంది బాధితులకు సత్వరం రక్షణ కల్పించి అద్భుతాలు సాధించారని తెలిపింది. దిశా మొబైల్ యాప్ కేవలం ఐదు నెలల్లోనే 12.57 లక్షల డౌన్లోడ్లను చేయడంతో రికార్డు సృష్టించారని పేర్కొంది. టెక్నాలజీ ఉపయోగించుకుని కేసులను వేగంగా దర్యాప్తు చేసి.. ఎంతో సమయాన్ని ఆదా చేశారని కొనియాడింది.గతంలో కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీ అవార్డును గౌతామ్ సవాంగ్ అందుకున్నారు. అంతేకాకుండా ఏపీకి 13 జాతీయ స్థాయి అవార్డులు సాధించడంలో ఆయన కృషి చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని స్కోచ్, ఫిక్కీ, ఎన్సీఆర్బీ- నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో/కేంద్ర హోంశాఖ గతేడాది ఏపీకి అవార్డులను ప్రకటించిని సంగతి తెలిసిందే. వీటిలో అత్యుత్తమ పోలీసింగ్లో ఒకే రోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు కూడా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కే దక్కింది. తాజాగా ఏపీ డీజీపీ మరోసారి అత్యుత్తమ డీజీపీగా నిలవడంపై పోలీస్ శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa