ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ దేశంలోనే ఉత్తమ డీజీపీగా గుర్తింపు పొందడంతో.. ఆయన అభిమాని నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు డీజీపీ సైకత శిల్పం రూపొందించాడు. కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమించి రాష్ట్రానికి పోలీసులు ఎంతో కృషి చేసినందుకు గుర్తుగా సైకత శిల్పం రూపొందించినట్లు యువకుడు తెలిపాడు. దీంతో ఆ యువకుడిని నెల్లూరు జిల్లా పోలీసులు అభినందించారు. కరోనా సమయంలో ఎదురైన కఠిన సవాళ్లను అధిగమించి ఏపీ ప్రజలకు డీజీపీ విశేష సేవలు అందించారంటూ ద బెటర్ ఇండియా సంస్థ తెలిపింది. అదే విధంగా దిశ యాప్ ద్వారా మహిళలకు సత్వర రక్షణ కల్పించారని.. టెక్నాలజీ సహాయంతో కేసులను వేగంగా దర్యాప్తు చేశారని.. ఈ సేవలన్నీ గుర్తిస్తూ దేశంలోనే బెస్ట్ డీజీపీగా గుర్తించినట్లు సంస్థ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్కి బెటర్ ఇండియా సంస్థ దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు అందించింది. మన రాష్ట్ర డీజీపీ ఉత్తమ అవార్డుతో సత్కారం పొందడంతో.. చిల్లకూరు మండలం ఏలూరు గ్రామానికి చెందిన సనత్ కుమార్ అనే యువకుడు సైకత శిల్పం ఏర్పాటు చేశాడు. దీంతో నెల్లూరు ఎస్పీ విజయరావు సనత్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. చిల్లకూరు ఎస్సైలు సుధాకర్ రెడ్డి, అజయ్ కుమార్ సనత్ కుమార్ రూపొందించిన సైకత శిల్పాన్ని ప్రారంభించి.. రూ.5 వేలు నగదు బహుమతి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa