ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు ఆందోళన చెందవద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 03:27 PM

విజయనగరం: రైతుల నుండి ధాన్యాన్ని కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల కు కూడా ధాన్యాన్ని పంపించే ఏర్పాట్లను చేసామని అన్నారు. మిల్లర్ల తో మాట్లాడి వెంటనే లిఫ్టింగ్ చేయాలనీ ఆదేశించడం జరిగిందని, మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే రైతులు బయట కూడా అమ్ముకోవచ్చునని స్పష్టం చేసారు. ప్రభుత్వం కొనుగోలు చేసినదానికి 21 రోజుల్లో చెల్లింపులు చేస్తామని తెలిపారు. రైతుల విన్నపం మేరకు తేమ యంత్రాలను మిల్లర్ల వద్ద కాకుండా రైతు భరోసా కేంద్రాల వద్ద నే రీడింగ్ తీసుకునేల చూస్తామని అన్నారు.


బ్యాంకు గ్యారంటీ లు ఇచ్చి కూడా లిఫ్ట్ చేయని మిల్లుల లైసెన్స్ లను శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం 20 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోళ్ళు జరిగాయని రెండు రోజుల్లో అంతా సర్దుకొని సజావుగా జరుగుతుందని స్పష్టం చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa