తమిళనాడులో గత 24 గంటల్లో 4,862 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 27,60,449కి చేరింది. గత 24 గంటల్లో మొత్తం 1,17,611 నమూనాలను పరీక్షించారు.కరోనా నుండి 688 మంది కోలుకున్నారు, రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 27,07,058కి చేరుకుంది.గత 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 36,814కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,577 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa