భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. నేటి మ్యాచ్ తో టీమిండియా చరిత్ర సృష్టించనుంది. చారిత్రాత్మక 1000వ వన్డే మ్యాచ్ ఆడనుంది. మరోవైపు ఇంగ్లండ్తో జరిగిన టి20 సిరీస్లో విజయం సాధించిన ఉత్సాహంతో వెస్టిండీస్ జట్టు భారత్లో అడుగుపెట్టింది. ఇప్పుడు వన్డే సిరీస్లో శుభారంభం చేయాలని ఆ జట్టు కూడా తహతహలాడుతోంది.
వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, కరోనాతో ధావన్, శ్రేయస్, రుతురాజ్, సైనీలు ఈ మ్యాచ్ కు దూరం అయ్యారు. మయాంక్ అగర్వాల్ కు క్వారంటైన్ పూర్తి కాలేదు. దీంతో ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ ఓపెనర్లుగా ఆడనున్నారు. చాన్నాళ్ల తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు అవకాశం దక్కనుంది. గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ తుది బెర్త్ కోసం దీపక్ హుడాతో పోటీపడనున్నాడు. మరోవైపు విండీస్ జట్టుకు గాయంతో హెట్మైర్, కోవిడ్తో ఎవిన్ లూయిస్ దూరమయ్యారు. దీంతో కొత్త కుర్రాళ్లు ఒడియన్ స్మిత్, రొమరియో షెఫర్డ్, బ్రాండన్ కింగ్లతో భారత్తో సమరానికి సిద్ధమైంది.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, పంత్, సూర్యకుమార్, దీపక్ హుడా/వాషింగ్టన్ సుందర్, చహర్, శార్దుల్, కుల్దీప్, చహల్, ప్రసిధ్ కృష్ణ.
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), హోప్, బ్రాండన్ కింగ్/బానెర్, పూరన్, బ్రూక్స్, డారెన్ బ్రేవో, స్మిత్/షెఫర్డ్, హోల్డర్, హొసెయిన్, రోచ్, హెడెన్ వాల్‡్ష జూనియర్.
భారత జట్టు ఇప్పటివరకు 999 వన్డేలు ఆడింది. 518 మ్యాచ్ల్లో గెలిచింది. 431 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 9 మ్యాచ్లు 'టై'గా ముగిశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa