ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ గేట్ కుంభకోణంలో చిక్కుకున్న ఆర్థికమంత్రి రిషి సునక్

international |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 11:41 AM

బ్రిటన్ లో తీవ్ర దుమారం రేపుతున్న....పార్టీ గేట్  కుంభకోణంలో తాజాగా అక్కడి ఆర్థికమంత్రి రిషి సునక్  కూడా చిక్కుకున్నారు. 2020 జూన్ లో ప్రధాని బోరిస్  జాన్సన్  కార్యాలయ భవనంలో జరిగిన పార్టీలో పాల్గొన్నట్లు..... రిషి ఒప్పుకున్నట్లు ద మిర్రర్  పత్రిక పేర్కొంది. అయితే పార్టీలో ఏం జరిగిందో....ఆయన వెల్లడించలేదని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా విందులో పాల్గొనలేదన్న ఆయన..........ఓ అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు మాత్రమే వెళ్లినట్లు తెలిపారు. బ్రిటన్ లో లాక్ డౌన్  అమల్లో ఉన్న సమయంలో నిబంధనలను ఉల్లంఘించి....ప్రధాని బోరిస్  జాన్సన్  తన కార్యాలయంలో పార్టీలు చేసుకోవడంపై.....పెద్దఎత్తున దుమారం రేగుతోంది. ఆయన  రాజీనామా చేయాలని డిమాండ్  పెరుగుతున్న నేపథ్యంలో.... ఆయన వారసుడి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్  కూడా ఉన్నారు. ఇప్పడు ఆ నాటి విందు పార్టీలో తాను పాల్గొన్నట్లు ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa