హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు ఊరట కలిగించే వార్త వెలిసింది. రాబోయే 48 గంటల్లో సుమారు 94,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ను తీసుకువస్తున్న రెండు ట్యాంకర్లు ముంబై, మంగళూరు తీరాలకు చేరే అవకాశం ఉంది. బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్ అనే ఈ రెండు గ్యాస్ ట్యాంకర్లు ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ మార్గం ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన సరఫరా మార్గాల్లో ఒకటిగా ఉండటం, అక్కడ జరిగే ప్రతి పరిణామం భారతదేశ ఇంధన భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.గల్ఫ్ ప్రాంతంలో భారత నౌకాదళం యుద్ధనౌకలను మోహరించింది. అవసరమైతే LPG సరఫరాను రక్షించేందుకు భారత నౌకలు సిద్ధంగా ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్కు "ఆపరేషన్ ఊర్జా సురక్ష" అని పేరు పెట్టారు. దీని ప్రధాన లక్ష్యం అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య దేశానికి నిరంతర ఇంధన సరఫరాను కాపాడటం. ఇప్పటివరకు నాలుగు నౌకలు సురక్షితంగా భారత్ చేరాయని, ఇంకా 18 భారతీయ నౌకలు హర్మూజ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నారని సమాచారం. మొత్తం 24 నౌకలు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.చిక్కుకుపోయిన నౌకల్లో సుమారు 500 మంది భారతీయ నావికులు ఉన్నారు. పరిమిత వనరుల వల్ల, వారు శాటిలైట్ కాల్స్ ద్వారా తమ కుటుంబాలతో కనెక్ట్ అయ్యారు. ముంబై, కొచ్చి, విశాఖపట్నంలోని వారి కుటుంబాలు వీరు సురక్షితంగా తిరిగి రావాలని ఆశిస్తున్నారు.రాబోయే LPG సరఫరా దేశీయ అవసరాలను సుమారు మూడు రోజుల పాటు తీర్చగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. LPG కొరత సమస్యతో బాధపడుతున్న పరిస్థితుల్లో ఇది ప్రజలకు కొంత ఉపశమనం కలిగించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa