ప్రజా సమస్యలను వెంటనే తీర్చటం కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను అత్యద్భుతంగా, దేశానికే ఆదర్శప్రాయంగా సచివాలయ వ్యవస్థను తీసుకోచ్చారని తెలిపారు. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీజీ కన్న కలలను సాకారం చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనాలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని భూమన కరుణాకర రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
కార్యాలయ ఆవరణలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నగర మేయర్ డాక్టర్ శిరీష, డెప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, తహశీల్దార్ రమణ తో కలిసి సోమవారం ఉదయం శెట్టిపల్లిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజా రంజక పరిపాలన అందిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలు తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపు నిచ్చారు. వివిధ రకాల కార్యాలయాల చుట్టూ తిరగకుండా మైఖ్యమైన పనులను నేరుగా గ్రామ సచివాలయంలోనే చేసుకునే వెసులుబాటు కల్పించడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఏకైక గ్రామమమైన శెట్టిపల్లిలో గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించడం సంతోషకర మన్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ శెట్టిపల్లి గ్రామం భాగమైన కారణంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమానికి రావాలనుకున్నారని, అయితే మరో అత్యవసర కార్యక్రమానికి వెళ్లడంతో ఈ కార్యక్రమానికి రాలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa