రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ మరో 45 మంది అభ్యర్థులను బీజేపీ ఆదివారం ప్రకటించింది. అమేథీ నుండి సంజయ్ సిన్హ్, బల్లియా నగర్ నుండి దయా శంకర్ సింగ్ను బరిలోకి దింపింది.సంజయ్ సిన్హ్ అమేథీలోని పూర్వపు రాజకుటుంబానికి చెందిన వ్యక్తి, 2019లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం అమేథీ స్థానానికి సిన్హ్ మొదటి భార్య గరిమా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దయాశంకర్ సింగ్, అతని భార్య స్వాతి సింగ్ కోసం సరోజినీ నగర్ నుండి పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్ను ఆశిస్తున్న తరుణంలో అధికార పార్టీ మాత్రం మాజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజేశ్వర్ సింగ్ని అక్కడి నుండి రంగంలోకి దించింది. అలాగే, పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ను తప్పించి, బైరియా నుంచి రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాను పోటీకి దింపింది. కుషీనగర్ జిల్లా పద్రౌనా నుంచి మనీష్ జైస్వాల్ను పోటీలో ఉంచింది.ఈ స్థానం నుంచి మొదట కాంగ్రెస్ అభ్యర్థిగా జైస్వాల్ బరిలో నిలవగా.. కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ బీజేపీలో చేరిన తర్వాత జైస్వాల్ ఇటీవలే కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఇక, పద్రౌనా నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బీజేపీని విడిచిపెట్టి ఇటీవల సమాజ్వాదీ పార్టీ (ఎస్పి)లో చేరగా ఈ పరిణామం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ఖుషీనగర్ జిల్లాలోని ఫాజిల్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మౌర్యను సమాజ్వాదీ పార్టీ బరిలోకి దింపింది. ఇక, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుండి బీజేపీలో చేరిన అజంగఢ్లోని సాగి ఎమ్మెల్యే వందనా సింగ్ ఈ స్థానం నుండి నామినేట్ అయ్యారు.
బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ కుమారుడు రాంవిలాస్ చౌహాన్ను బీజేపీ మౌ జిల్లాలోని మధుబన్ నుంచి బరిలో నిలిపింది. ఇటీవల ఎస్పీలో చేరిన రాష్ట్ర మంత్రి ధారా సింగ్ చౌహాన్ ప్రస్తుతం మధుబన్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే, ముహమ్మదాబాద్ నుంచి అల్కా రాయ్ను, ఘాజీపూర్ జిల్లాలోని ఘాజీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి సంగీత బల్వంత్ బింద్ను బీజేపీ పోటీకి దింపింది. రాష్ట్ర మంత్రి అనిల్ రాజ్భర్ వారణాసిలోని శివపూర్ నుండి నామినేషన్ వేయగా, నీలకాంత్ తివారీకు వారణాసి దక్షిణం, రవీంద్ర జైస్వాల్లకు వారణాసి ఉత్తర నియోజకవర్గాల నుండి టిక్కెట్లు లభించాయి. ఇక, రాష్ట్ర మంత్రి రామ్శంకర్ పటేల్ మీర్జాపూర్ జిల్లా మరిహన్ నుంచి బరిలోకి దిగనున్నారు. 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa