ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూడూరు కోసం పార్టీలకతీతంగా పోరాడుదాం: మాజీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 04:25 PM

గూడూరు కోసం పార్టీలకతీతంగా పోరాడుదామని నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని డాక్టర్ సీఆర్. రెడ్డి విశ్రాంత ఉద్యోగుల భవనంలో పట్టణ ప్రముఖులతో సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్. కాలేషా అధ్యక్షతన గూడూరును నెల్లూరు జిల్లాలోనే ఉంచాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాల స్ఫూర్తితో గూడూరును జిల్లాగానైనా ప్రకటించాలని లేనిపక్షంలో నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని పార్టీలకతీతంగా చేపట్టనున్న కార్యక్రమాలలో విద్యార్థులు, యువత అగ్రభాగాన ఉండాలని సూచించారు.


కలిసొచ్చే ప్రతి పార్టీని కలుపుకుని పోరాడుదామన్నారు. వైసీపీ నాయకులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి అందరి సహకారంతో ఉధృతం చేద్దామన్నారు. ప్రయివేటు స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు దశరధరామిరెడ్డి మాట్లాడుతూ కరపత్రాలను సిద్థం చేసి ఇంటింటికీ పంపిణీ చేసి ప్రజలను చైతన్యవంతులను చేద్దామని సూచించారు.


సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్. కాలేషా మాట్లాడుతూ లాయర్స్ అసోసియేషన్, పాన్ బ్రోకర్స్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, డాక్టర్ల అసోసియేషన్, అన్ని పారటీఅందరినీ సమైఖ్య పరిచి న్యాయపోరాటం చేద్దామన్నారు. జిల్లా కలెక్టర్ కీ వినతిపత్రం అందించాలన్నారు. అనంతరం గూడూరు నియోజకవర్గ ప్రజాభిప్రాయ సాధన సమితి పేరుతో పట్టణ మేధావులు, విద్యావేత్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు.


ఈ సమావేశంలో బీ. దశరధరామిరెడ్డి, ఎన్. బాలకృష్ణమనాయుడు, నెలబల్లి భాస్కర్ రెడ్డి, కొండూరు వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రావుల శివ ప్రసాద్ గౌడ్, నాశిన భాస్కర్ గౌడ్, ఆర్. బ్రహ్మయ్య, పీ. కోటేశ్వరరావు, మాకాని వెంకటేశ్వర్లు, వెంకటేష్, సీవీఆర్. కుమార్, ఎండీ. అన్వర్ బాష, ఎంబేటి చంద్రయ్య, షేక్. జమాలుల్లా, షేక్. చాన్ బాష, మీజూరు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa