ఇటీవల దండుపాళ్యం పేరిట వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాల్లో దండుపాళ్యం గ్యాంగ్ ఎంత దారుణంగా నగలు నగదు కోసం హత్యలు చేస్తారో చూపించారు. అయితే ఆ గ్యాంగ్ లో పది మంది వరకు ఉంటారు. అలాంటిది ప్రకాశం జిల్లాకు చెందిన కేవలం ఇద్దరు అంతకుమించి నేరాలకు పాల్పడి చివరకు కటకటాల పాలయ్యారు.
కందుకూరి పట్టణానికి చెందిన అక్కల శివ కోటయ్య, జరుగుమల్లి మండలం దావా గూడూరు గ్రామానికి చెందిన కంకిపాటి నరేష్ కలిసి ఒకేసారి ఇద్దరు చొప్పున నలుగురిని హత్య చేశారు. ఒక మహిళపై హత్యా ప్రయత్నం చేశారు. ఇక దొంగతనాలు, దోపిడీలకైతే అంతేలేదు.
2018 సంవత్సరాలు చీమకుర్తిలో ఇద్దరు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసు ఇప్పటికీ పెండింగులో ఉండింది. తాజాగా గత ఏడాది డిసెంబర్లో టంగుటూరులో తల్లీ కూతురు కూడా హతమయ్యారు. దీంతో జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ఈ కేసుల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా ఈ ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. వారి వద్ద దాదాపు ముప్పై మూడు లక్షల రూపాయల విలువ చేసే నగలు నగదు దొరకటాన్ని బట్టే ఆ ఇద్దరి నేరచరిత్రను అంచనా వేయవచ్చు. ఇక చీమకుర్తి టంగుటూరులో వారు జంట హత్యలకు పాల్పడిన విధానం ఆ నేరస్థుల క్రూర మనస్తత్వానికి అద్దం పడుతోంది.
టంగుటూరు కేసులో ముద్దాయిలు ముందుగా రెక్కి నిర్వహించి రాత్రి 08. 15 సమయంలో తాము దోపిడీకి ఎంచుకున్న ఇంటికి వెళ్లి డోరు కొట్టారు. జలదంకి వెంకట లేఖన ఫోన్ తలుపు తీయగానే ఆమెపై దాడి చేసి కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి గొంతు కోశారు. లేఖన తల్లి శ్రీదేవి అరుచుకుంటు రాగా పెప్పర్ స్ప్రే కొట్టి ఆమె గొంతు కూడా కోసి వారి ఒంటి మీద ఉన్న బంగారం తీసుకొని పారిపోయారు.
ఇక చీమకుర్తిలో వెంకటసుబ్బారావు రాజ్యలక్ష్మి దంపతులను తలపై రాడ్ తో మోది చంపేసి నగలు తీసుకున్నారు. ఆ నేరం చేసి వస్తూ దారిలో ఒక రెడీమేడ్ షాపులోకి వెళ్ళి అక్కడున్న మహిళ పై కూడా దాడి చేసి నగదు అపహరించారు. ఇంతటి కిరాతకులను పట్టుకున్న పోలీసులు పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa