ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆవుల స్మగర్ల నుంచి రూ.2.5 కోట్ల ఆస్తుల స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2017, 05:25 PM

అక్రమ పశువధ్యశాలలపై బలమైన వేటు వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఆవులను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తుల ఆస్తులపై కూడా దృష్టి సారించింది. ఆవుల స్మగ్లింగ్‌లో ప్రమేయమున్న వ్యక్తులకు సంబంధించిన రూ.2.5 కోట్ల ఆస్తులను యూపీ పోలీసులు జప్తు చేశారు. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద గోవుల స్మగ్లింగ్‌ లీడర్ ఫర్హాన్, ఆయన సోదరులైన సారిక్, సుహాన్‌ ఆస్తులను సీజ్ చేయాలని గ్రామ తలసిల్దార్‌కు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో తహసిల్దార్ ఆనంద్‌కుమార్ సింగ్ కొత్వాల్ పోలీసులతో కలిసి మొరాదాబాద్‌లో ఉన్న ఫర్హాన్, ఆయన సోదరుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పలు వ్యవసాయ భూములు, మరికొన్ని ప్లాట్‌లు ఉన్నాయి. మియా సరాయ్‌కి చెందిన ఫర్హాన్ గోవుల స్మగ్లింగ్ లీడర్ అనీ, గత ఐదేళ్లుగా ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ భారీగా సంపద కూడబెట్టాడని ఏసీపీ పంకజ్ కుమార్ పాండే తెలిపారు. ఫర్హాన్, ఆయన సోదరులను జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పగించినట్టు చెప్పారు. కాగా, స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa