ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరగా వైద్యం చేయ్ లేదంటే చంపేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2017, 04:58 PM

కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ హుగ్లీ జిల్లా శ్రీరామ్‌పోర్‌లోని పారామౌంట్ నర్సింగ్ హోమ్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్‌ను బెదిరించారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రోడ్డుప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువచ్చారు ఐదుగురు వ్యక్తులు. ఆస్పత్రి నిబంధనల ప్రకారం.. రోగికి ఏం జరిగిన ఆస్పత్రి బాధ్యత వహించదు అనే కాగితాలపై సంతకం చేయమని ఆస్పత్రి సిబ్బంది వారిని అడిగింది. సంతకాలు చేయమని వారు సిబ్బందికి తేల్చిచెప్పారు. ఈ క్రమంలో చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో క్షతగాత్రుడికి త్వరగా వైద్యం చేయమంటూ.. ఆ దుండగులు డాక్టర్‌పై పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించారు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. ఇంతలోనే క్షతగాత్రుడితో సహా అందరూ అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa