ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాంబులతో దద్దరిల్లుతున్న ఖార్కివ్.. 20 మంది పౌరులు మృతి

international |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 06:23 PM

ఉక్రెయిన్‌ దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రష్యా వరుసగా జరుపుతున్న బాంబు దాడుల్లో 20 మంది పౌరులు చనిపోయినట్లు ఖార్కివ్ మేయర్ ఇహోర్ తెరెఖోవ్ వెల్లడించారు. తాజాగా రష్యా క్షిపణి దాడులకూ పాల్పుతోందని ఆయన ఆరోపించారు. సామాన్యులపై, జనావాసాలపై రష్యా దాడులకు తెగబడుతోందని వాపోయారు. రష్యా దాడుల్లో ఓ కారులో ఉన్న కుటుంబం అంతా ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రష్యా ఈ నగరంలోనే క్షిపణి దాడులకు పాల్పడగా భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప చనిపోయారు. భీకర యుద్ధ వాతావరణం ఏర్పడిన తరుణంలో మిగిలిన భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. తాజాగా భారత వాయు సేన సి-17 విమానాలతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు బయల్దేరింది. సి-17 విమానాల ద్వారా ఒకే సారి 500ల మందిని తరలించొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa