ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి నిమిషం విలువైనదే: రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 04:22 PM

ఉక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్ లో రష్యా దళాల దాడిలో ఓ భారతీయ విద్యార్థి (నవీన్) మృతి చెందడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. భారతీయ విద్యార్థి నవీన్ ఉక్రెయిన్ లో మరణించాడన్న విషాదకర వార్త విన్నానని, నవీన్ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. "నేను మరోసారి చెబుతున్నా... ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలంటే ఓ నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి. వ్యూహాత్మకంగా నడుచుకోవాలి. ప్రతి నిమిషం విలువైనదే" అంటూ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు.  అపారసైనిక బలగం, భారీ ఆయుధ సంపత్తి కలిగిన రష్యా... ఇన్ని రోజులు గడుస్తున్నా ఉక్రెయిన్ లొంగకపోవడం పట్ల తీవ్ర అసహనంతో ఉంది. మరిన్ని బలగాలను ఉక్రెయిన్ నగరాలపైకి పంపిస్తున్న రష్యా దాడుల్లోనూ పదును పెంచింది. పౌర నివాస సముదాయాలను సైతం రష్యా బాంబులు తాకుతుండడమే అందుకు నిదర్శనం. ఖార్కివ్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న నవీన్ ఈ తరహా దాడుల్లోనే మృతి చెందాడు. రష్యా సైనికులు పేల్చిన ఓ షెల్ నవీన్ నివాసం ఉంటున్న భవనాన్ని తాకింది.  ఇదిలావుంటే  ఖార్కివ్ లో 3 వేల నుంచి 4 వేల మంది వరకు భారతీయులు ఉంటారని అంచనా. రష్యా సేనలు ఉక్రెయిన్ లో అంతకంతకు చొచ్చుకుని వస్తుండడం, రష్యా బలగాలు తీవ్రస్థాయిలో దాడులకు దిగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో, భారతీయులను అక్కడి నుంచి తరలించడం కేంద్ర ప్రభుత్వానికి పెనుసవాలుగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa