శింగనమల మరవకొమ్మక్రాస్ వద్ద బుధవారం ఆటో బోల్తా పడి వివాహిత వసంత (28) మృతి చెందింది. కొట్టాలపల్లి గ్రామానికి చెందిన వసంత తన పుట్టినిల్లు అయిన శింగనమల గ్రామంకు వెళ్లింది. అక్కడ ఉన్న సామగ్రిని ఆటోలో వేసుకుని కొట్టాలపల్లికి వస్తుండగా మరవకొమ్మవద్ద కుక్కలు అడ్డం రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన వసంతను అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త ప్రతాప్ రెడ్డి, ఒక పాప, కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై శింగనమల పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తాపడి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఆ మహిళను కాపాడటానికి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విఫలయత్నం చేశారు. తాడి పత్రి నుంచి అనంతపురం వస్తున్న సమయంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రమాద స్థలాన్ని గమనించి తన వాహనాన్ని ఆపాడు. గాయపడి మహిళను తన కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించాడు. అయినా చివరికి ఆమె ప్రాణాలు పోవడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa