వివాహేతర బంధం ఇద్దరు మిత్రల మధ్య చిచ్చు రేపింది. ఇందులో స్నేహితుడు తన మిత్రుడిని ఏడాది క్రితం హతమార్చి తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ ప్రసాద్బాబు కథనం మేరకు. వి. కోట పట్టణం నారాయణనగర్కు చెందిన నరేష్(28), ముదిమడుగు గ్రామానికి చెందిన ఇస్మాయిల్(23) ఎలక్ర్టీషియన్లు. ఇద్దరూ పట్టణానికి చెందిన ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆమెతో ఇస్మాయిల్ చనువుగా ఉండడాన్ని నరేష్ సహించలేకపోయాడు. ఎలాగైనా అంతమొందించాలని పథకం పన్నాడు. నరేష్ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇస్మాయిల్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. అందులో కొంత చెల్లించి మరో రూ. 10 వేలు తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇస్మాయుల్ బెంగళూరుకు వెళ్లాడు. అయితే 2021 జనవరి 5వ తేదీని వి. కోటకు వస్తున్నాని, తనకు పదివేలు ఇవ్వాలని ఇస్మాయల్. నరేష్ను కోరారు.
ఈ నేపథ్యంలో వి. కోట చేరుకున్న ఇస్మాయిల్, నరేష్ ఇద్దరూ కలిసి మద్యం తీసుకుని వి. కోట పట్టణ సమీపంలోని కీలపల్లె చెరువు వద్దకు చేరుకున్నారు. వారిద్దరి మధ్య మహిళ ప్రస్తావన వచ్చింది. దీంతో వారిద్దరూ గొడవ పడ్డారు. ఆగ్రహించిన నరేష్ అతని తలపై బీర్ బాటిల్తో బలంగా కొట్టాడు. మృతి చెందినట్లు నిర్థారించుకున్నాడు. అక్కడే గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఇస్మాయిల్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసిన పోలీసులు 15 నెలల అనంతరం సెల్ఫోన్ ఆధారంగా నిందితుడిని కనిపెట్టారు. ఈ మేరకు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది కీలపల్లె చెరువు వద్దకు చేరుకున్నారు. అయితే ప్రాంతం నీటితో నిండి ఉండటంతో ఆనవాళ్ళు కనిపెట్టలేక పోయారు. ఈ మేరకు నిందితుడు నరేష్ను రిమాండు నిమిత్తం పలమనేరు కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు. ఏడాది తర్వాత పట్టుబడ్డాడు నిందితుడు నరేష్ ఏడాది తర్వాత పట్టుబడ్డాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa