మే నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు అల్లాడుతున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఇటీవల ప్రజలను అప్రమత్తం చేసింది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను కూడా వెల్లడించింది. వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 670 మండలాలకు గాను శుక్రవారం (ఏప్రిల్ 8) 16 మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. ఈ మండలాలన్నీ కడప (5), కర్నూలు (11) జిల్లాల్లో ఉన్నాయి. రానున్న 24 గంటల్లో (ఏప్రిల్ 9) తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పెనుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో (ఏప్రిల్ 10) రాష్ట్రంలోని 6 మండలాల్లో కూడా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. విజయనగరం (4), విశాఖపట్నం (1), తూర్పుగోదావరి (1) జిల్లాల్లోని మండలాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa