ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మంత్రి మండలి విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 10, 2022, 09:08 AM

ఏపీలో మంత్రి మండలి విస్తరణపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ క్యాబినెట్‌లో చోటు కోసం ఆశావహ ఎమ్మెల్యేలు గంపెడాశలు పెట్టుకున్నారు. పాత క్యాబినెట్‌లో 10 మందిని కొనసాగించి, కొత్తగా 15 మందికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. రాజ్‌భవన్‌కు పాత క్యాబినెట్ మంత్రుల రాజీనామాలను, కొత్త మంత్రుల జాబితాను సీఎం వైఎస్ జగన్ పంపించారు. గవర్నర్ దానికి ఆదివారం లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. ఇక కొత్తగా ఎంపికైన మంత్రులకు ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వెళ్తుంది. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయిస్తారు. సామాజిక సమీకరణలు, జిల్లాల పరిధి తదితర కారణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రి వర్గ కూర్పును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టారు. అయితే అందులో ఎవరికి చోటు లభిస్తుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa