ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఆరు కార్లు ఢీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 10, 2022, 11:10 AM

విజయవాడలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పడమట నగర శివారులో శనివారం నిడమానూరు బ్రిడ్జ్‌ వద్ద జాతీయ రహదారిపై సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈనాడు కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన రవి తన కారులో గన్నవరం వైపు వెళ్తున్నారు. నిడమానూరు వద్దకు రాగానే బ్రేక్‌డౌన్‌ అవ్వడంతో అకస్మాత్తుగా ఆగిపోయింది. దాని వెనుకే వస్తున్న కార్లు కూడా ఒకేసారి బ్రేకులు వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో మొత్తం 6 కార్లు ధ్వంసం అయ్యాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇందులో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa