చేసిన నేరం నుంచి తప్పించుకొనే క్రమంలో వేసే వ్యూహాలు కొన్ని ఎవరికైనా షాక్ కు గురిచేస్తాయి. అలాంటి ఘటనయే ఇది. శిథిలావస్థలో ఉన్న ఓ ఇంట్లో ఏకంగా రూ. 1.42 కోట్ల నగదు, బంగారం బయటపడింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని సలియాసాహి బస్తీలో ఈ ఘటన జరిగింది. గంజాం జిల్లా భంజనగర్ మైనర్ ఇరిగేషన్ విభాగంలో సహాయ ఇంజినీరు (ఏఈ)గా పనిచేస్తున్న కార్తికేశ్వర రవుళొ ఆస్తులపై అధికారులు మూడు రోజులుగా విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా కార్తికేశ్వర రెండో భార్య కల్పనను పోలీసులు విచారించారు.
ఈ సందర్భంగా తన సోదరి సలియాసాహి బస్తీలో ఓ శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉంటోందని ఆమె తెలిపింది. దీంతో నిన్న ఆ ఇంటికి చేరుకున్న అధికారులు సోదాలు నిర్వహించి రూ. 1.42 కోట్ల నగదు, 345 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా కార్తికేశ్వరకు సంబంధించి రూ. 4.76 కోట్ల విలువైన నగదు, ఆస్తి వెలుగులోకి వచ్చినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa