ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా చేపట్టిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కాక రేపుతోంది. గత క్యాబినెట్లో చోటు దక్కించుకుని, తాజా మంత్రివర్గంలో స్థానం లభించలేదని మేకతోటి సుచరిత అలక బూనారు. గత క్యాబినెట్లోని ఐదుగురు ఎస్సీ మంత్రుల్లో నలుగురిని ప్రస్తుతం కొనసాగించి, తనకు మాత్రమే ఉద్వాసన పలకడం ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆమె ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె కుమార్తె రిషిత ఆదివారం రాత్రే మీడియాకు తెలిపారు. అంతేకాకుండా తనను బుజ్జగించేందుకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణకు స్పీకర్ ఫార్మాట్లో సుచరిత రాజీనామా లెటర్ను అందజేశారు. సోమవారం కార్యకర్తలు, అనుచరులతో సమావేశంలో సుచరిత తన నిర్ణయాన్ని తెలిపారు. అయితే వైసీపీలో కొనసాగనున్నట్లు చెప్పారు. ఆమెకు మద్దతుగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa