ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ సంచలన ఆరోపణలు

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 11:28 AM

ఐపీఎల్‌ ప్రారంభ రోజుల్లో తనను 15వ అంతస్తు నుంచి వేలాడదీశారని ఇటీవల భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇదే తరహాలో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న సమయంలోనూ ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. 2011లో ముంబయి జట్టు తరుపున తాను ఆడాడనని, అప్పట్లో ఛాంపియన్స్ లీగ్ ఆడేందుకు చెన్నై వెళ్లామని చాహల్ చెప్పాడు. ముంబై జట్టు సహచర ఆటగాళ్లు జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌, ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ తన కాళ్లూ చేతులు కట్టి వేశారన్నారు. అంతేకాకుండా తాను అరవకుండా నోటికి టేపు అంటించారన్నారు. ఆ తర్వాత వారు సంబరాల్లో మునిగిపోయి తనను మర్చిపోయారని చెప్పాడు. రాత్రంతా గదిలో అలాగే ఉన్నట్లు పేర్కొన్నాడు. మరుసటి రోజు ఉదయం గది క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది చూసి, తన కట్లు విప్పారని తెలిపాడు. వారిద్దరూ తనకు ఎప్పుడూ క్షమాపణ కూడా చెప్పలేదని అన్నాడు. కాగా 2011 నుంచి 2013 వరకు ముంబయి జట్టుకు ఆడిన ఫ్రాంక్లిన్‌ ప్రస్తుతం డర్హమ్‌ కౌంటీ ప్రధాన కోచ్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. చాహల్ ఆరోపణలపై డర్హమ్ జట్టు మేనేజ్‌మెంట్ స్పందించింది. ఈ ఘటనపై ఫ్రాంక్లిన్‌తో ప్రైవేట్‌గా మాట్లాడి విషయం తెలుసుకుంటామని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa