ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల కోసం నేటి నుంచి పవన్ యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 11:26 AM

రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. అనంతపురం నుంచి ఆయన యాత్ర ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి పవన్‌ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి కొత్త చెరువు గ్రామానికి చేరుకుంటారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. కొత్త చెరువు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించి, వారికి జనసేన తరుపున రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. అక్కడి నుంచి ధర్మవరం చేరుకుని మరో రైతు కుటుంబానికి కూడా సాయం అందజేస్తారు. ఆ తర్వాత ధర్మవరం రూరల్ గొట్లూరు గ్రామం, అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో ఆయన మాట్లాడనున్నారు. పవన్ పర్యటనకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa