ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 10:08 AM

ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ అందించింది. జోన్ పరిధిలో 'హాలిడే స్పెషల్ ట్రైన్స్' పేరుతో 19 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. మొత్తం 19 రైళ్లలో విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య ఒకరైలు మంగళవారం బయలుదేరింది. ఏప్రిల్ 13న హైదరాబాద్‌-నర్సాపూర్‌, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడటౌన్‌, సికింద్రాబాద్‌-బరంపురం మార్గాల్లో ఐదు రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 14న నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, తిరుపతి-కాచిగూడ, తిరుపతి-సికింద్రాబాద్‌, కాకినాడటౌన్‌-తిరుపతి, నాందేడ్‌-తిరుపతి, బరంపురం-సికింద్రాబాద్‌ మార్గాల్లో ఆరు రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. 15న తిరుపతి-కాకినాడటౌన్‌, తిరుపతి-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య 3 రైళ్లను, 16న సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య, 17న నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, కాకినాడటౌన్‌-వికారాబాద్‌, తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య మూడు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులంతా స్పెషల్ ట్రైన్లను ఉపయోగించుకోవాలని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa