ఏపీలో జిల్లాల పునర్వ్యస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాలో కొత్తగా 2 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్గా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. కడప జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ గా పులివెందులను ప్రకటించారు. జమ్మలమడుగు, కడప రెవెన్యూ డివిజన్లలోని 8 మండలాలను వేరు చేసి కొత్తగా పులివెందుల రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేశారు. పులివెందుల రెవెన్యూ డివిజన్ తో కడప జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 4 కు పెరిగింది.
మరోవైపు కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ లో పామర్రు మండలాన్ని, మచిలీపట్నంలో ఘంటసాల మండలాన్ని కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో నగరి రెవెన్యూ డివిజన్లోని 2 మండలాలను చిత్తూరు రెవన్యూ డివిజన్లోకి మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. నగరిలోని శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం మండలాలను చిత్తూరు రెవన్యూ డివిజన్ కు మార్పు చేశారు.
కొత్తపేట రెవెన్యూ డివిజన్లోని మండలాలు: ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి
పులివెందుల రెవెన్యూ డివిజన్లోని మండలాలు: సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వెంపల్లి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa