పెట్రోల్ వాహనాలను వీడి, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టిసారిస్తున్న ప్రజలకు అవి మంటల్లో కాలిపోతుండడం కలవరానికి గురి చేస్తోంది. తాజాగా 20 ఎలక్ట్రిక్ వాహనాలు కాలి బూడిదవడం సంచలనం రేకెత్తించింది. ఏప్రిల్ 9న మహారాష్ట్రలోని నాసిక్లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్లను కంటైనర్లో తరలిస్తుండగా అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. నాసిక్లోని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జితేంద్ర న్యూ ఈవీ టెక్ కంపెనీ ఫ్యాక్టరీలోనే ఈ ప్రమాదం జరిగింది.
ఆ స్కూటర్లను బెంగళూరుకు తరలిస్తుండగా వాటిలో మంటలు చెలరేగాయి. మొత్తం 40 స్కూటర్లతో కంటైనర్ బయల్దేరింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి, అందులో 20 వాహనాలు దగ్ధమయ్యాయి. మూడు వారాల వ్యవధిలో మంటలు ఏర్పడి ఎలక్ట్రిక్ బైక్లు తగులబడిన ఘటనల్లో ఇది ఐదవది. మార్చి 26న పుణెలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రికల్ స్కూటర్, అదే రోజున తమిళనాడులోని వెల్లూరులో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ మంటలు చెలరేగి బూడిదయ్యాయి. మార్చి 28న తిరుచ్చిలోనూ. 29న చెన్నైలోనూ ఇవే తరహా ఘటనలు జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa