ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ స‌ర్కార్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 11:34 AM

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌పై దృష్టిసారించింది. ఇప్పటికే ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్న సర్కారు న‌గదు బ‌దిలీ విధానంపై సమాలోచనలు చేస్తోంది. ఎవ‌రైనా రేషన్ ల‌బ్దిదారులు తమకు బియ్యం వ‌ద్దు అనుకుంటే అందుకు బ‌దులుగా డ‌బ్బు ఇవ్వాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి 2020 ఆగష్టులోనే ప్రతిపాదన రాగా, తాజాగా ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, నంద్యాల ప్రాంతాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కిలోకు రూ.12 నుంచి రూ.15 వరకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa