ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 01:31 PM

గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. '31 లక్షల మందికి ఇల్లు కట్టే శాఖకి సీఎం జగన్ తాను మంత్రిగా చేయడం ఆనందంగా ఉందన్నారు. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేస్తున్నారని విశాఖపట్నంలో ఇల్లు నిర్మాణం ఫైల్‌పై తొలి సంతకం చేశానని వివరించారు. గతంలో ఇంటి నిర్మాణానికి 90 సిమెంట్ బ్యాగ్‌లు ఇచ్చేవాళ్లమని ఇప్పుడు 140 సిమెంట్ బస్తాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని అన్నారు. పాదయాత్రలో ప్రతి గ్రామంలో జగనన్నకి పేదలు కష్టాలు చెప్పారని ఆ కష్టాలను చూసి ఈ రోజు ఇల్ల నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. పేదలకు సేచురషన్ పద్దతిలో ఇల్లు కట్టిస్తున్నామని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్ అధిక గుర్తింపు ఇచ్చారని సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనన్న' అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa