ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో మత్స్య సంపద వేటపై నిషేధం అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 02:08 PM

సముద్రగర్భంలోచేపలపునరుత్పత్తిజరిగేకాలంకావడంతో రెండు నెలల పాటు మత్స్య సంపద వేటపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం శుక్రవారం జిల్లాలో అమలులోకివచ్చింది. ఈకారణంగా బంగాళాఖాతం తీరం వెంబడి మత్స్యకార గ్రామాల్లో చేపలు వేటాడే బోట్లకువిరామం కలిగింది. కోనసీమ, కాకినాడ జిల్లాలలో సముద్ర తీరం వెంబడి ఏడు మండలాలు వున్నాయి. అందులోనిమత్స్యకార గ్రామాలలో బోట్లకు చెందిన సుమారు20వేలమందిలబ్ధిదారులు వున్నారు. వీరిపై వేట నిషేధం ప్రభావం చూపనుంది.


శనివారం నుంచి జూన 14 వరకు సముద్ర జలాల్లో మత్స్య సంపద వేట నిషేధం వుంటుంది మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యతమత్స్యశాఖఅధికారులపైన, తీర ప్రాంత గస్తీ దళాలపైన ఉంటుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అత్యధికంగా మత్స్యకారుల కుటుంబాలు ఉండే ప్రాంతం కావడంతో నిషేధితరెండునెలలసమయంలో మాంసాహారులకు సముద్రపు చేపలు దొరకడం కష్టమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa