జనసేన నేత నాగబాబు ఇటీవల చేసిన ఓ ట్విట్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇదిలావుంటే నాగబాబు తన మనసులోని మాటను నిస్సంకోచంగా వెల్లడిస్తారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఆయన ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'మీరు మీ ప్రభుత్వ వ్యవహారాలపై ఆసక్తి చూపకపోతే... మీరు మూర్ఖుల పాలనలో జీవించడం ఖాయం' అని ట్వీట్ చేశారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే విషయంలో క్లారిటీ లేదు. అయితే, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్టు నెటిజన్లు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa