ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరగనున్న సిమెంట్ ధర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 11:05 AM

రష్యా, ఉక్రెయిన్  యుద్ధ ప్రభావం .. సిమెంట్ ధరలపైనా పడింది. ఏప్రిల్ లో  సిమెంట్ బస్తా ధర పెరగనున్నట్లు  క్రిసిల్ అంచనా వేసింది. దేశీయ మార్కెట్ లో గత 12 నెలల కాలంలో  సిమెంట్ బస్తా ధర 390 రూపాయలకు చేరగా  దీనికి అదనంగా బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకూ  పెరగవచ్చని తన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా ముడిచమురు, బొగ్గు, పెట్ కోక్ ధరలు పెరగటం వలన సిమెంటు తయారీ వ్యయం గణనీయంగా పెరిగినట్లు. క్రిసిల్ తెలిపింది. ఇంధన ధరల పెరుగుదలతో సిమెంట్  ముడి పదార్థాల శుద్ధి, ప్యాకింగ్  మెటీరియల్  తయారీ సరఫరా, ప్రయాణ ఖర్చులు పెరుగుతున్నట్లు పేర్కొంది. ఫలితంగా ఈ భారాన్ని కంపెనీలు వినియోగదారులపై మోపే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa