భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఎండ వేడిమి కారణంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే 40 డిగ్రీలు దాటిన నేపథ్యంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. వీటికి తోడు విద్యుత్ కోతల వల్ల ప్రజలు ఉక్క పోతలతో అల్లాడిపోతున్నారు.
దీంతో పట్టణ ప్రజలు సేద తీరేందుకు బాపట్ల సూర్యలంక తీరానికి దారి కట్టారు. ఇక్కడి చల్లటి గాలితో ఉపశమనం చెందుతున్నారు. ఉదయం నుండే సూర్యాపేట కు అటు యువతతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా బయలుదేరుతున్నారు. బాపట్ల పట్టణంలో నుండే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇక్కడకు రావడంతో యాత్రికుల తాకిడి పెరిగింది.
ఎక్కువగా ఈ ప్రాంతానికి ఉమ్మడి గుంటూరు జిల్లా విజయవాడ కృష్ణా జిల్లా ప్రజలు వస్తుంటారు. వచ్చే వారి కోసం ఇక్కడ హోటల్లో సేదతీరేందుకు రూములు అన్నీ అందుబాటులో ఉన్నాయి. సామాన్య ప్రజలు దారి వెంబడి ఉండేవి జీడి మామిడి తోటల్లోని చల్లటి నీడ లో కళాక్షేపం చేస్తున్నారు.
ప్రతి ఏడాది వేసవిలో బాపట్ల సూర్యలంక కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏఏడుకాఏడు పెరుగుతూనే ఉంది. దీనికితోడు పర్యాటక శాఖ వారు కూడా పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది ఇక్కడ ప్రాంతం ఎంతో ఆకర్షణీయంగా తయారయింది. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కూడా తోడవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa