మత్తులో నరసరావుపేట ఊగిసలాడుతున్నది అంటే నమ్మక తప్పదు. ఈ మధ్య కాలంలో గంజా , డ్రగ్స్ విదంతాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఐతే తాజాగా మరో భయంకర ఘటన పల్నాడు జిల్లా కేంద్ర బిందువు ఐన నరసరావుపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... నరసరావుపేట టౌన్ శివారులలో ఉన్న srkt కాలనీ , ఎదురుగా ఉన్న rtc కాలనీ లలో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటం విశేషం.
గురువారం అనగా నిన్న రాత్రి , పనస తోట, వరవకట్ట కి సంబంధించిన కొంతమంది యువకులు , ఒక యువతిని rtc కాలనీ లోకి తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలు చేస్తుండగా , స్థానికంగా అక్కడ కొన్ని సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న కుటుంబాలలో ఒకటైన మాతంగి శాంతయ్య కుటుంబ సభ్యులు , ఇలాంటి చర్యలు మా ఇండ్ల దగ్గర చెయ్యడం మంచి పద్దతి కాదు , ఇక్కడి నుండి వెళ్లిపోండి అని హెచ్చరించారు. కానీ మద్యం మరియు గంజా మత్తులో ఉన్న వీరు మీ ఇంట్లోకి వచ్చి చేస్తున్నానా అని తిరగబడి అతని పై చేయీ చేసుకోవడం జరిగింది. ఇది గమనించిన శాంతయ్య అన్న కొడుకు వీరేంద్ర బాబు వెళ్లి వారిని ప్రశ్నిచడంతో తోపులాట మొదలైనది. చిన్న ఘర్షణ తో శాంతయ్య కుటుంబ సభ్యులు ఇంటికి వెనుతిరిగారు.
అంతటితో ఊరుకొని తాగుబోతులు ఫోన్ చేసి మరి కొంతమంది(దాదాపుగా 30 మంది ) వ్యక్తులని పిలిపించుకొని రాడ్లు, రోకలి బండలు , కర్రలు తీసుకువచ్చి ఒక్కసారిగా శాంతయ్య ఇంటి మీద దాడి చెయ్యడం జరిగింది. ఈ దాడిలో , శాంతయ్య ఇంటి సబ్యులంధరికి గాయాలు కాగా , నలుగురు ఆసుపత్రి పాలైనారు. ఇందులో ఇద్దరికి పరిస్థితి విషమించడంతో గుంటూరు జనరల్ హాస్పిటల్ కి తరలించారు. ఈ దాడిలో శాంతయ్య ఇంటిని కూడా పగలకొట్టి , లోపల ఉన్న టీవీ , ఫ్రిజ్ లాంటి వస్తువులను కూడా ధ్వంసం చేసారు. వీరు ఇంతకీ తెగించడానికి కారణం , వీరు మత్తులో ఉండటమే కాకుండా లోకల్ రాజకీయ నాయకుల అండదండలు వీరికి ఉండటమే అని స్థానికులు వాపోతున్నారు. గొడవకి వచ్చిన వారిలో నేర చరిత్ర కలిగిన వారు , మర్డర్ కేసులలో ముద్దాయిగా ఉండి బైలు మీద బయట తిరుగుతున్నవారు ఉండటం గమనార్హం . ఐతే ఈ విషయం పై స్థానిక నేతలు ఇంకా స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa