ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొండా ఉమా..నీకు ముందుంది మొసళ్ల పండగ: వాసిరెడ్డి పద్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 08:45 PM

నీకు ముందుంది మొసళ్ల పండగా అంటూ బొండా ఉమను ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే వున్నాయి. "నువ్వు ఒరేయ్ అంటే మేం ఒసేయ్ అనలేమా... అత్యాచారం జరిగిన మూడ్రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని పరామర్శకు వచ్చారు, అన్నీ అబద్ధాలే చెప్పారు" అంటూ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ ధ్వజమెత్తారు. దీనిపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. 


"బోండా ఉమా... నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు... నీకు ముందుంది మొసళ్ల పండగ. కాలకేయుడిలాంటి నీకు మహిళలే బుద్ధి చెబుతారు. మహిళల పట్ల మరోమారు అమర్యాదగా మాట్లాడితే చెప్పుదెబ్బలు తింటావు" అంటూ హెచ్చరించారు. తమకేమీ పబ్లిసిటీ పిచ్చి లేదని పద్మ అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బోండా ఉమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 


కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు అని, ఇప్పుడు బోండా ఉమ కారణంగా చంద్రబాబుకు చెడ్డపేరు వచ్చిందని టీడీపీ వాళ్లే బోండా ఉమను తిడుతున్నారని ఎద్దేవా చేశారు. తనను మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి నుంచి దించేవరకు పోరాడాలని బోండా ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపించాడని, బోండా ఉమ తన పేరును సార్థకం చేసుకుంటున్నాడని, టీడీపీ ఉత్తమ నారి బోండా ఉమ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


బోండా ఉమను ఇప్పటివరకు ఓ ఆకు రౌడీ అనుకున్నానని, తాజా పరిణామాలతో మరీ చిల్లర రౌడీ అని అర్థమైందని వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడ ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్ ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని వాసిరెడ్డి పద్మ టీడీపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులకు ఓ విద్యార్థిని బలైపోతే టీడీపీ నేతలు అప్పుడు ఎక్కడికెళ్లారు? అని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa