వైఎస్సార్ కాంతి పథం పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మైలవరంలో ఎస్. వి. ఎస్ కళ్యాణ మండపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. మైలవరం, జి. కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాల పరిధిలోని పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గవిగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కరోనా లాంటి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ సంక్షేమ పథకాల అమల్లో వెనకడుగు వేయలేదన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రధాన ధ్యేయంగా పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa