జిల్లా కేంద్రంలో నేటి నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, పకడ్బందీగా నిర్వహిద్దామని ఎంఈఓ వెంకటరమణ నాయక్ పేర్కొన్నారు. ఆయన జిల్లా కేంద్రంలో నిర్వహించే పదో తరగతి పరీక్షలపై డిపార్టమెంటల్ చీఫ్ అఫీసర్లకు, ఇన్విజిలేటర్లుకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో మొత్తం నాలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఎనుమలపల్లి, పుట్టపర్తి జడ్పీ ఉన్నతపాఠశాలలు, పుట్టపర్తి లోని వారాది ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్ఎస్ఎస్ ఇంగ్లీసు మీడియం స్కూల్లో మొత్తం 597మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
ఇన్విజిలేటర్లు పరీక్షకేంద్రానికి ఉదయం 8 గంటలకే చేరుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్షకేంద్రంలోకి రాకముందే వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపాల న్నారు. విద్యార్థులు పరీక్షకేంద్రంలో ఉన్నంతసేపు అన్నిసౌకర్యాలు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు.
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎలాంటి మాస్ కాపీయంగ్ లేకుండా చూడాలన్నారు. గాలి, వెలుతురు, తాగునీరు ఉండేవిదంగా అన్నిఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa