ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యాపారి ఇంటి వద్దే ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 09:59 AM

కొత్తూరు మండలంలోని మదనాపురం గ్రామంలో ఒడిశాలోని విస్తల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విస్తల గ్రామానికి చెందిన బెవర గోవిందరావు (58) మదనాపురం గ్రామానికి చెందిన ఓ వ్యాపారికి ప్రతి ఏటా ధాన్యం అమ్మకాలు చేస్తున్నాడు. సదరు వ్యాపారి రూ. లక్షల్లో బాకీ ఉండటంతో నిత్యం గ్రామానికి వచ్చి బాకీ డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నాడు.ఈనాడు లో వచ్చిన కథనం ప్రకారం, మంగళవారం కూడా వచ్చి వ్యాపారి నారాయణరావు ఇంటికి వెళ్లి నిలదీశాడు.


దీంతో ఆ వ్యాపారి బ్యాంకుకు వెళ్లి నగదు తెచ్చి ఇస్తానని చెప్పి వెళ్లారు. ఈలోగా మనస్తాపానికి గురైన గోవిందరావు తనతో తెచ్చుకున్న పురుగుల మందును అతడి ఇంటి వద్దే తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు వెంటనే స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారులున్నారు. ఈ మేరకు ఫిర్యాదును అందుకున్న వెంటనే ఎస్సై చంద్రకళ, ఏఎస్సై సింహాద్రి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa