మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం గ్రామంలో టీడీపీ నాయకులూ నారా లోకేష్ పర్యటించారు. జగన్ బాదుడే బాదుడు అనే కార్యక్రమం ద్వారా , విద్యుత్ కోతలకు నిరసనగా ప్రజలకు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టె ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నాను. గ్రామంలో ఇళ్ల పట్టాలు, డ్రైనేజ్ సమస్యలను ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చాను. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలు, ఇటీవల మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చాను అని తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa