ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదుల హతం

national |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 12:27 PM

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ తీవ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన హైదర్, కుల్గామ్‌కు చెందిన షాబాజ్‌ షాగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో దేవ్‌సర్ ప్రాంతంలోని చెయాన్ గ్రామంలో తెల్లవారుజామున భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేశారు. ఆ సెర్చింగ్‌లో ఉగ్రవాదులు తారసపడగా.. భద్రత బలగాలు కాల్పులు జరిపారు. తీవ్రవాదులకు, భద్రతా సిబ్బందికి కొంతసేపు ఫైరింగ్ జరిగింది.


ఆ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఉన్న హైదర్ రెండేళ్లుగా ఉత్తర కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడని, అనేక నేరాల్లో పాల్గొన్నాడని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. "హైదర్ బందిపొరాలో ఇటీవల జరిగిన రెండు ఉగ్రవాద నేరాల్లో పాల్గొన్నాడు. ఆ ఘటనల్లో ముగ్గురు పోలీసులు పోలీసులు చనిపోయారు." అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.


హతమైన రెండో ఉగ్రవాది స్థానికుడని, అతడిని కుల్గామ్‌కు చెందిన షాబాజ్ షాగా గుర్తించినట్టు విజయ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 13న కుల్గామ్‌లోని కక్రాన్‌లో సతీష్ కుమార్ సింగ్ అనే పౌరుడిని హత్య చేయడంలో షాబాస్ షా హస్తం ఉందని ఆయన చెప్పారు. ఇక ఎన్‌కౌంటర్ ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa