ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాలిబాన్లను మించిపోతున్న కిమ్ జాంగ్

international |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 09:54 PM

ఉత్తరకొరియా దేశాదినేత కిమ్ జాంగ్ సంచలన నిర్ణయాలలో తాలిబాన్లను  మించిపోతున్నాడు. తాజాగా ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి ఆంక్షల కొరడా ఝుళిపించారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతుల వేషధారణపై తీవ్ర ఆంక్షలు విధించారు. యువతులు టైట్ జీన్స్ వేసుకోవడం, అభ్యంతరకర రాతలు ఉన్న దుస్తులు ధరించడంపై ఇటీవలే నిషేధం విధించారు. తాజాగా, యువతులు జుట్టుకు రంగులు వేయడంపైనా కిమ్ సర్కారు నిషేధం విధించింది. 


ఆంక్షలను ఉల్లంఘించిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తారని స్పష్టం చేసింది. వారు తప్పును అంగీకరించాల్సి ఉంటుందని, మరోసారి ఆ తప్పుచేయబోమని హామీ ఇస్తేనే విడుదల చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. పాశ్చాత్య ఫ్యాషన్ పోకడలు విషపూరితమైనవని కిమ్ గతంలోనే సెలవిచ్చారు. ఈ నేపథ్యంలో, దేశంలో విదేశీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ఉత్తర కొరియా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa