ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ : లక్నో కు 145 పరుగులు లక్ష్యం ఇచ్చిన గుజరాత్

sports |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 10:04 PM

లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే గుజరాత్ బ్యాటర్లకు లక్నో బౌలర్లు షాకిచ్చారు. పరుగులు కట్టడి చేయడంతో పాటు కీలక వికెట్ల తీశారు. గుజరాత్ బ్యాటర్లలో శుభమన్ గిల్ 63 (నాటౌట్) పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. సాహా (5), వేడ్ (10), హార్దిక్ పాండ్య (11), మిల్లర్ (26), తివాతియా (22*) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మోషిన్ ఖాన్, హోల్డర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa