ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఘటనలపై ప్రభుత్వానిది ఉద్దేశపూర్వక మౌనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 10:08 PM

రాష్ట్రంలో జరుగతున్న హత్యలపై , అత్యాచారాలపై  వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక మౌనం పాటిస్తోందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.  నిన్న నెల్లూరులో ప్రేమోన్మాది యువతిని కాల్చి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన విచారకరం అని ఆయన తెలిపారు.  అటు సత్యసాయి జిల్లాలో వెంటవెంటనే రెండు ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా సీఎం స్పందించరా? హోంమంత్రి ఈ విషయాలపై నోరు మెదపరా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 


ఏది జరిగినా గంటలో మీడియా ముందుకు వచ్చే మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు వీటిపై మాట్లాడరా? అని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే  వైసీపీ నేతలు వీటిపై స్పందించకుండా, దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటనలపై సీఎం, హోంమంత్రి ఎందుకు సమీక్ష చేయలేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. 


ఏపీలో శాంతిభద్రతల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మంత్రులను మార్చడం కాదని, ముఖ్యమంత్రినే మార్చితే పరిస్థితి అదుపులోకి వస్తుందని హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa